Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైన్ నిర్వహించినట్టు కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి అన్నారు. కలెక్టర్ెేలో శుక్రవారం జనగామ మండలంలోని భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు రోజుల కిందట భూ సమస్యలున్న వారు ప్రతి శుక్రవారం కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఒక్క రోజే 300మంది భూమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీటిలో 45 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. సమస్యలను తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. తహసీల్దార్ రవీందర్, ఈర్డీఓ మధుమోహన్, వీఆర్ఓలు, ఆర్ఐలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏఓ విశ్వప్రసాద్, లాండ్ సర్వేయర్ కొండల్రెడి పాల్గొన్నారు.