Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు అందజేసి ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తహసీిల్ధార్ మాధవి, ఆర్ఐ సాంబయ్య, నాయకులు నర్సింగరావు, ప్రసాద్ నాయుడు, గండ్ర యువసేన జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి పూర్ణచందర్రెడ్డి, ఉప సర్పంచ్ పోతర్ల అశోక్, పాషా పాల్గొన్నారు.