Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ వైద్య బృందం
లండన్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు మెరుగైన చికిత్స అందించేందుకు అమెరికాకు తరలించాలని బ్రిటన్ వైద్య బృందం పేర్కొంది. షరీఫ్ రక్తకణాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందని తెలిపింది. ఆయన శరీరంలో రక్త ప్రసరణ కూడా సరిగ్గా లేకపోవడం ఆందోళనకరంగా మారిందని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తెలిపారు. షరీఫ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను అమెరికాకు తరలించడం సవాలుగా మారిందని ఆమె అన్నారు. గతనెల 19న చికిత్స కోసం షరీఫ్ను పాకిస్థాన్ నుంచి లండన్కు తీసుకొచ్చారు. పాకిస్థాన్ హైకోర్టు ఆదేశానుసారం లండన్లోని హార్వే క్లినిక్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే, షరీఫ్ను అమెరికాకు తరలించాలని బ్రిటన్ వైద్య బృందం సలహా ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆయన్ను అమెరికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.