Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇద్దరు మాజీ ప్రధానులకు జైలుశిక్ష ! | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

ఇద్దరు మాజీ ప్రధానులకు జైలుశిక్ష !

- అవినీతి ఆరోపణల కేసుల్లో అల్జీరియా కోర్టు సంచలన తీర్పు
- దేశ వ్యాప్తంగా ప్రజల సంబురాలు
- రేపు జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల సంఘం
అల్జీర్స్‌ : ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు మాజీ ప్రధానులకు అల్జీరియా ప్రత్యేక న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధించింది. గురువారం అల్జీరియా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టు తీర్పు వెలువడటంతో మాజీ ప్రధానుల మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అవినీతికి పాల్పడిన నేతలకు శిక్ష పడటంతో దేశ ప్రజలంతా సంబురాలు జరుపుకుంటున్నారు. అల్జీరియా చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...పలు కార్ల కంపెనీల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పెట్టుబడుల రూపంలో పెట్టి లాభాలు ఆర్జించినట్టు మాజీ ప్రధానులు అహ్మద్‌ ఔయాహియా, అబ్దెల్‌మాలెక్‌ సెల్లాల్‌లపై మోపిన నేరారోపణలు రుజువయ్యాయి.
ఈ కేసులో అహ్మద్‌ ఔయాహియాకు 15ఏండ్ల కారాగారం, 16,000 డాలర్ల ( రూ.11,33,528) జరిమానా, అబ్దెల్‌మాలెక్‌కు 12ఏండ్ల కారాగారం, 8,000 డాలర్ల ( రూ.5,66,764 ) జరిమానా విధించినట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మాజీ పారిశ్రామిక శాఖ మంత్రి అబ్దెసలామ్‌ బౌచౌరెబ్‌కు 20ఏండ్ల జైలుశిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన ప్రవాసంలో ఉన్నారు. ఆయన ఏ దేశంలో ఉన్నా అరెస్ట్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రముఖ వ్యాపారవేత్త అలీ హదాద్‌కు ఏడేండ్ల శిక్ష పడింది. ఈ కేసులో 19 మంది అభియోగాలు ఎదుర్కొన్నారు. వీరందరిలో మాజీ రవాణా శాఖ మంత్రి అబ్దెల్‌ ఘనీ జాలెన్‌ మాత్రమే నిర్దోషిగా బయటపడటం గమనార్హం. తాజా తీర్పుతో అల్జీరియాలో రాజకీయ పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం అధ్యక్ష ఎన్నికలు జరుగను న్నాయి. అవినీతికి పాల్పడ్డ నేతలకు, మద్దతుదారులకు మంగళవారం కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టుగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్టేట్‌ మీడియాలో ట్రయల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రజలు కోర్టు ఆవరణలో వీక్షించి సంబురాలు జరుపుకున్నారు. ఈఏడాది ఏప్రిల్‌లో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌అజీజ్‌ బౌటెఫ్లికా గద్దె దిగారు. ప్రజాందోళనలు పెల్లుబికిన నేపథ్యంలో అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. అవినీతికి పాల్పడిన మంత్రులను కూడా గద్దె దించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరుకొని ఆందోళనలు చేపట్టారు. ఈ అల్లర్లలో అనేక మంది గాయపడ్డారు. 1962లో అల్జీరియాకు స్వాతంత్య్రం వచ్చింది. ఫ్రాన్స్‌ నుంచి విడిపోయి స్వతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
అయితే, అవినీతి ఆరోపణల కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు మాజీ ప్రధానులు జైలుకెళ్లడం ఇదే ప్రథమం. అవినీతి నిర్మూలనపై అల్జీరియన్లు 40 వారాల పాటు అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఫలితం దక్కిందని చీఫ్‌ ప్రాసిక్యూటర్స్‌ కార్యాలయం వెల్లడించింది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం నిరసనకారులు జాతీయ పతకాలతో దేశ వ్యాప్తంగా దర్శనమిచ్చారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. అవినీతిరహిత సమాజ నిర్మాణమే తమ ధ్యేయమంటూ నినాదాలు చేశారు. ' ఇకపై అవినీతికి పాల్పడాలంటే నేతల వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని' ఫ్రొఫెసర్‌ రాచిడ్‌ లెరాసి అన్నారు. అవినీతిరహిత పాలన అందించే అభ్యర్థులకు మాత్రమే ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో పట్టంకడతారని ఆమె అభిప్రాయపడ్డారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌ లోనే కాదు విదేశాల్లోనూ...
అమెరికాలో మళ్లీ ఆంక్షలు
ముదిరిన రాజకీయ సంక్షోభం
భారత్‌, పాక్‌ సరిహద్దులకు వెళ్ళొద్దు
మండలిలో సంస్కరణలు అవశ్యం : భారత్‌
త్వరలో భారత్‌లో పర్యటిస్తా.. : బోరిస్‌ జాన్సన్‌
జాతీయ దినోత్సవాన్ని మార్చాలి
భారత్‌తో సహా నాలుగుదేశాలపై ప్రయాణ ఆంక్షలు తొలగించిన రష్యా
సోషలిజం పరిరక్షణకు పునరంకితం
కరోనా కొత్త ముప్పుతో సరిహద్దుల మూత
పోర్చుగల్‌ అధ్యక్షుడిగా మార్సెలో తిరిగి ఎన్నిక
మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి

తాజా వార్తలు

02:48 PM

కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదు..

02:38 PM

ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం పలికిన సుందర్ పిచాయ్

02:31 PM

మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు

01:56 PM

రైతులపై పెట్టిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే

01:44 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ఎగిసి పడుతున్న నీళ్లు..

01:42 PM

భారత్‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న టిక్‌టాక్‌

01:25 PM

భార్య కోసం టవర్ ఎక్కి భర్త హల్ చల్..

01:23 PM

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు సజీవ దహనం

01:11 PM

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది : జగదీశ్ రెడ్డి

01:06 PM

పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం

01:06 PM

హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చెందవద్దు : కొప్పుల ఈశ్వర్

01:03 PM

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న క‌మ‌ల హ్యారిస్‌..!

12:58 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం: జ‌న‌సేన‌

12:54 PM

29న ఆచార్య టీజర్ విడుదల

12:40 PM

చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు

12:38 PM

హెచ్4 వీసాదారులకు శుభవార్త..

12:30 PM

ఏపీ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ లోగో

12:23 PM

బ్రిటన్​లో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు

12:20 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

12:14 PM

జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించలేకపోయాం : సీఏ

12:09 PM

రైలు ఢీకొని యువ‌కుడు మృతి

12:01 PM

ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లకు గాయాలు

11:46 AM

నాగార్జున సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన కాంగ్రెస్ నేత గల్లంతు..

11:40 AM

నవ వధువు ఆత్మహత్య...

11:37 AM

దేశంలో కొత్తగా మరో 12వేల పాజిటివ్ కేసులు

11:34 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

11:33 AM

కరోనా టీకా Expiry Date.. 6నెలలు మాత్రమే..!

11:30 AM

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

11:25 AM

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

11:23 AM

గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.