Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు అందరూ ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే క్రమంగా లాక్డౌన్లో సడలింపులు రావడంతో.. ఉద్యోగులను తిరిగి ఆఫీసు రావాల్సిందిగా సంస్థలు కోరుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇతర సంస్థలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటాయని అనుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హౌమ్ చేస్తే.. అది ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని.. పరస్పర సంబంధాలూ దెబ్బ తింటాయని ఆయన అన్నారు. న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించారు.. వ్యక్తిగతంగా చర్చించుకోవడానికి.. వీడియో కాల్స్ ఎప్పటికీ భర్తీ చేయలేవని అన్నారు. ''నేను మీటింగ్స్ని మిస్ అవుతున్నా. ఒక వ్యక్తి మన పక్కనే ఉంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు'' అని నాదెళ్ల అన్నారు. శాశ్వత వర్క్ ఫ్రమ్ హౌమ్ కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. దీనివలన కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయన తెలిపారు.