రంగారెడ్డి: జిల్లాలోని యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం సృష్టించింది. చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇప్పటికే పిల్లిపల్లి గ్రామ శివారులోని పొలంలో ఆవు దూడను పులి చంపి తినేసినట్టు స్థానికులు గుర్తించారు. దీంతో వారి భయం మరింత పెరిగి ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు చిరుతను త్వరగా బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలు సేకరించారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని త్వరలోనే చిరుతను పట్టుకుంటామని అటవి అధికారులు స్థానికులకు దైర్యం చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm