అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ వంతెన కూలిపోవడంతో మహిళ గల్లంతైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ సమీపంలో తుంగభద్ర ఎగువ కాలువ 115/167 కిలోమీటర్ వద్ద నిర్మించిన వంతెనపై బొలేరో వాహనం వస్తుండగా అకస్మాత్తుగా వంతెన కూలిపోయింది. దాంతో సావిత్రి (30) అనే మహిళ కూలి కాలువలో పడి గల్లంతయింది. మిగతా 29 మంది కూలీలను స్థానికులు సురక్షితంగా రక్షించారు. గల్లంతయిన మహిళా కూలీ కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm