న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో న్యాయం లేదని, అసలు అది ఆఖరి పరిష్కార మార్గం కావాలని వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమె సావేద్ర తెలిపారు. విద్యారంగంపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో సావేద్ర బృందం అధ్యయనం చేస్తోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలను మళ్లీ తెరిస్తే కరోనా కేసులు పెరుగుతా యనడానికి, స్కూళ్లు సురక్షిత ప్రదేశాలు కావని అనుకోడానికి సరైన సాక్షాధారాలు లేవని అన్నారు. రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్స్, తెరిచే ఉంచడం, స్కూళ్లు మూసివేయించడంలో అర్ధం లేదని ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. స్కూళ్లు తెరిస్తే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తక్కువే ఉంటా యని, మూసివేయడం వల్ల మూల్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm