హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుధీర్ఘంగా సాగింది. తొమ్మిది గంటల పాటు జరిగిన క్యాబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని మంత్రివర్గానికి వివరించిన వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్రావు పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుకోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు తెలిపిన మంత్రి అర్హులైన వారందరికీ అతి త్వరగా టీకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల సహాయం తీసుకొని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని సీఎం ప్రజలను కోరారు.
క్యాబినెట్ కీలక నిర్ణయాలు
మెదక్ జిల్లాలోని ఘన్పూర్ ఆనికట్ కాల్వలవ్యవస్థ ఆధునీకరణలో.. మిగిలిన పనులుచేపట్టేందుకు 50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు పచ్చజెండా ఊపింది. ఆదిలాబాద్జిల్లాలో పెన్గంగపై నిర్మిస్తున్న చనాకా - కొరాటా ఆనకట్ట అంచనా వ్యయాన్ని 795.94 కోట్లకు సవరించింది. ఆ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని.. భీమ్పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి 27.36 కోట్లతో పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. వనపర్తి జిల్లాలో గోపాలసముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు 10 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూర్యాపేట జిల్లాలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి, జాన్పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి 16.23 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను ఆమోదించింది. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణ కోసం మంజీరా లిఫ్ట్ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. దేవాదులపథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు 104.92 కోట్లతో పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గండిరామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులు... గుండ్ల సాగర్ నుంచి లౌక్యతండా వరకు పైప్ లైన్ పనులు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 06:52AM