హైదరాబాద్ : ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. జనవరి 31 మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు.
ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్లో చర్చింబోయే అంశాల గురించి ప్రతిపక్షాలకు సూచనప్రాయంగా తెలియజేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడుత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 08:38PM