హైదరాబాద్ : జార్ఖండ్లో మావోయిస్టులు వరుసగా దుశ్చర్యలకు పాల్పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను మావోయిస్టులు తెల్లవారుజామున పేల్చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్ను పేల్చేశారు. మరో టవర్కు నిప్పుపెట్టి కలకలం రేపారు. మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్రస్తుతం ఃరెసిస్టెన్స్ వీక్ః పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధ్వంసాలకు తెగబడుతున్నారు. మావోయిస్టుల చర్యల నేపథ్యంలో వారి కోసం ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm