హైదరాబాద్ : జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను బెదిరించడంతో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఓ బుకీ నుంచి కొంత మొత్తంలో డబ్లులు తీసుకున్నట్టు తెలిపాడు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో జరిగిన ఘటన పై వివరణ ఇచ్చాడు.
'నేను 2 సంవత్సరాలకు పైగా భారాన్ని మోస్తున్నాను, అది నన్ను చాలా చీకటి ప్రదేశాలకు తీసుకెళ్లింది. నా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2019లో ఓ భారత వ్యాపారవేత్తతో స్పానర్షిప్ గురించి మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. జింబాబ్వేలో ఓ టీ20 ప్రారంభించాలని ఆలోచనతో ఉన్నాం. అప్పటికే మాకు బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేపు. చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాం. అంతర్జాతీయ మైదానంలో ఆడటం కొనసాగించగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మా మీటింగ్ చివరి రాత్రి ఆ బిజినెస్మ్యాన్, అతడి మనషులు నన్ను కలవడానికి వచ్చారు. పార్టీ ఇచ్చారు. కొకైన్ ఆఫర్ చేశారు. కాదనలేక తీసుకున్నా. అనంతరం ఆ దృశ్యాలు చూపించి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని బెదిరించారు. లేకపోతే వీడియో బయటపెడతామన్నారు. నేను చాలా భయపడ్డాను. ఆ తర్వాతి రోజు అతడు నా హోటల్ రూమ్కు కూడా వచ్చాడు. అతడితో పాటు మరికొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు నాకు రూ. 15వేల డాలర్లు ఇస్తానన్నారు.అది ఇప్పుడు స్పాట్ ఫిక్సింగ్ కోసం డిపాజిట్ అని పని పూర్తయిన తర్వాత అదనంగా 20వేల డాలర్లు ఇస్తానన్నారు. ఏం చేయాలో తెలియక వాళ్లు చెప్పినదానికి అంగీకరించాను. నాకే వేరే అవకాశం లేదు. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. స్వదేశానికి వచ్చిన ఆ తర్వాత ఆ సంఘటన మానసికంగా శారీరకంగా చాలా దెబ్బతీసింది. ఆ వ్యాపారవేత్త తరచుగా ఫోన్ చేసేవాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బెదిరించేవాడు. ఈ విషయాన్ని ఐసీసీకి చెప్పడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. కానీ నేను ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లలో పాల్గొనలేదు. ఇప్పుడీ విషయాన్ని బయటపెట్టడం వల్ల ఐసీసీ నాపై ఏడాది కన్నా ఎక్కువ సంవత్సరాలు నిషేధం విధించవచ్చు. అయితే నాకు జరిగిన ఈ విషయం, కొత్త క్రికెటర్లు జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నా కుటుంబం, నా స్నేహితులు, మరీ ముఖ్యంగా నన్ను నేను మోసం చేసుకుంటూ బతకలేను. విలువలతో బతకాలనేదే నా ఉద్దేశం.` అంటూ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 08:40PM