హైదరాబాద్ : ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు ఈ ఏడాది స్మృతీ మందానను వరించింది. 2021 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. 2021 సీజన్లో స్మృతీ 22 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 38.86 సగటుతో 855 రన్స్ చేసిందని తెలిపింది. అందులో ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలున్నాయని పేర్కొంది. వాస్తవానికి 2021 సీజన్లో ఇండియా పెద్దగా రాణించకపోయినా.. స్మృతీ మందాన మాత్రం తన బ్యాట్తో సత్తా చాటడం వల్లే రేచల్ హైవో ఫ్లింటో ట్రోఫీని దక్కించుకున్నదని ఐసీసి వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm