హైదరాబాద్ : కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ప్రపంచదేశాలకు మరో పిడుగులాంటి వార్త. కొత్త రకం కరోనా నియో కోవ్ తో పెను ప్రమాదం పొంచి ఉందని వూహాన్ ల్యాబ్ సైటిస్టులు హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ కొత్త రకం కరోనా కారణంగా మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతుందని హెచ్చరించారు. నియోకోవ్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది. నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని స్పుత్నిక్ నివేదిక చెబుతోంది. 2012 -15 మధ్యకాలంలో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్ కు నియోకోవ్ కు సంబంధం ఉందని అంటోంది. తొలుత దక్షిణాఫ్రికా గబ్బిలాల్లో గుర్తించిన ఈ నియోకోవ్ వైరస్ ఇప్పటి వరకు మనుషులకు సోకలేదని సైంటిస్టులు చెప్పారు. ప్రస్తుతానికి జంతువుల నుంచి జంతువులకు మాత్రమే నియోకోవ్ సోకుతుండగా.. వైరస్ వస్తున్న మ్యూటేషన్ల కారణంగా మనుషులకు సోకే ప్రమాదం పొంచి ఉందని వూహాన్ సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ తరహాలోనే ఇది కూడా అత్యంత వేగంగా మనుషుల్లో వ్యాపించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm