హైదరాబాద్ : ప్రముఖ ఫుడ్ డేలివరి సంస్థ 'జొమాటో' సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జొమాటో యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలను కంపెనీ ముమ్మరం చేసింది.ఫుడ్తో పాటు లోన్లను కూడా అందించేందుకు జొమాటో సిద్ధమైంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్క్రెడ్తో జొమాటో 2020లోనే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలను అందజేస్తుంది. ఇది స్థూల సరుకుల విలువలో గణనీయమైన క్షీణతకు దారితీసింది. రూ.10 కోట్లతో ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. ఇది పూర్తిగా జొమాటో అనుబంధ సంస్థగా ఉండనుంది.సబ్సీడరీ కంపెనీకు ఏ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్బీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి కంపెనీ పేరు ఖరారు చేయబడుతుందని జొమాటో బిఎస్ఇకి ఇచ్చిన ఫైలింగ్లో తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm