హైదరాబాద్ : ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు దేశాల ప్రతినిధులు విమర్శలు చేసుకున్నారు. దాంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అబ్దుల్లా షాహిద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఉక్రెయిన్ రాయబారి సెర్గి రష్యన్ భాషలో రష్యా సైనికుడికి, అతని తల్లికి మధ్య జరిగిన సందేశాన్ని ఉద్వేకపూరితంగా చదివి వినిపించాడు. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, స్వతంత్రతను గుర్తించాలని.. తమ భూభాగం నుంచి రష్యా సైనికులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తూ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని సూచించారు. బెలారస్ నమ్మక ద్రోహన్ని ఐరాస గుర్తించాలన్నారు. ఉక్రెయిన్ మనుగడ లేకుంటే ఐరాస, అంతర్జాతీయ శాంతి మనుగడ ఉండదని పేర్కొన్నారు. అనంతరం రష్యా రాయబారి నెబెంజియా మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభానికి ఉక్రెయిన్ చర్యలే కారణమని అన్నారు. మిన్స్క్ ప్యాకేజీని ఉక్రెయిన్ ఏండ్ల తరబడి ఉల్లంఘిస్తూ వచ్చిందని ఆరోపించారు. ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకోవడం తమను సంఘర్షణలకు గురిచేసి, ప్రస్తుత పరిస్థితికి దారితీసిందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Mar,2022 07:07AM