చెన్నై: బంగాళాఖాతంలో సోమవారం వివిధ రకరాల మార్పులు ఏర్పడ్డాయి. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో సముద్రుడు ముందుకు రాగా, కన్నియాకుమారిలో వెనక్కి మళ్లడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. మహాబలిపురం ప్రాంతంలో రెండ్రోజులుగా అలల ఉదృతి అధికంగా ఉంది. దీంతో సముద్రపు ఆలయ పరిసరాల్లో నీరు చేరింది. దీని గురించి స్థానికులు మాట్లాడుతూ, జనవరి, జూన్ నెలల్లో దక్షిణం నుంచి ఉత్తరానికి, జూలై, డిసెంబరులో ఉత్తరం నుంచి దక్షిణానికి సముద్రాలు గాలులు వీస్తుంటాయని, దీంతో అలల ఉదృతి అధికంగా ఉండడం సహజమేనన్నారు. పౌర్ణమి కావడంతో అలల ఉధృతి పెరిగి సముద్రపు ఆలయ పరిసరాల వరకు నీరు చేరిందన్నారు. ఇలాంటి విపత్తులు ఏర్పడే సమయంలో హెచ్చరికలు చేసే అలారం వాతావరణ కేంద్రం వద్ద ఉందని, ఇలాంటి విపత్తులపై ముందుగానే హెచ్చరిస్తే ప్రాణ, ఆస్తినష్టం నివారించేందుకు వీలుంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm