హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,345 పాయింట్లు లాభపడి 54,318కి చేరుకుంది. నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16,259కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. మెటల్ సూచీ 7 శాతానికి పైగా, ఎనర్జీ సూచీ 4 శాతానికి పైగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఉన్న అన్ని కంపెనీలు లాభపడ్డాయి. టాటా స్టీల్ (7.67%), రిలయన్స్ (4.43%), ఐటీసీ (4.37%), విప్రో (4.23%), ఎల్ అండ్ టీ (4.00%) టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. మరోవైపు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎల్ఐసీ మాత్రం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది.
Mon Jan 19, 2015 06:51 pm