తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అలాగే బుధవారం కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారు. మొత్తం 74,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 38,007 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm