హైదరాబాద్ : రేపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున భీమా చెక్కులను పవన్ స్వయంగా అందజేయనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి మెట్టుగూడా అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా నల్గొండకు రానున్నారు. చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామంలో కొంగర సైదులు కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. సూర్యాపేట మీదుగా కోదాడలో కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm