హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అధిక వడ్డీలు, చిట్టీల పేరుతో మోసగించింది. ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని గజ్జి సుజాత కొందరి వ్యక్తుల నుంచి రూ. 3 కోట్ల వరకు డబ్బులు తీసుకుంది. కొంతకాలానికి వడ్డీ సరిగా చెల్లించకపోవడం, చిట్టీల డబ్బులు కూడా సమయానికి ఇవ్వకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని సుజాత బెదిరిస్తోందని బాధితులు సుమారు 100 మంది హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm