హైదరాబాద్: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలం తర్వాత మళ్లీ చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. గత రాత్రి జరిగిన మ్యాచ్ లో 73 పరుగులు చేసి మళ్లీ ఫాంలోకి రావడంపై ఆయన స్పందించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తాను టీమ్ లో సరిగ్గా రాణించలేకపోయానని అన్నాడు. దీంతో నిరాశకు గురయ్యానని అన్నాడు. తాజా మ్యాచ్ లో మాత్రం తాను ప్రభావం చూపించగలిగానని, దీంతో తమ జట్టు మంచి స్థితిలో నిలిచిందని తెలిపాడు. తాజా మ్యాచ్ లో తనపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు తాను ఆడిన విధానమేనని అన్నాడు. జట్టులో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన ఆలోచనా విధానాన్ని పాజిటివ్ గా ఉంచుకోవాలని తెలిపాడు. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోకూడదని చెప్పాడు.
తాను ఈ మ్యాచ్ లో రాణించేందుకు చాలా కష్టపడ్డానని తెలిపాడు. ఈ మ్యాచ్కు ముందు నెట్స్ లో దాదాపు 90 నిమిషాల పాటు సాధన చేశానని, దీంతో చాలా ప్రశాంతంగా మ్యాచులో ఆడగలిగానని అన్నాడు. షమీ బౌలింగ్ లో తొలిషాట్ కొట్టినప్పటి నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగిందని తెలిపాడు. ప్రస్తుత సీజన్ లో అభిమానుల నుంచి తనకు మంచి మద్దతు లభించిందని చెప్పాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 May,2022 10:48AM