హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూలతలు, ఐరోపా మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం, యూఎస్ ఫ్యూచర్స్ లాభాల్లో పయనిస్తుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,534 పాయింట్లు లాభపడి 54,326కి ఎగబాకింది. నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266కి చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm