Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 22, 2022
(Dated.22.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/F5bAqgy8Bd
హైదరాబాద్ : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 8,260 కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ అని నిర్ధారణయింది. అత్యధికంగా హైదరాబాదులో 24 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అలాగే 39 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ర్టంలో 397 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,92,871 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 7,88,363 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.