హైదరాబాద్ : పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మెన్ కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతల సబబు కాదని ఈఎన్సీ పేర్కొన్నారు. తద్వారా గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోందని.. మరి ఏపీలో కొత్త ప్రాజెక్టులేంటని పేర్కొన్నారు. దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm