దావోస్ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సోమవారం ఇప్పటికే అంతర్జాతీయ బీమా సంస్థ స్విస్రేతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా మీషోతో రెండో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మీషో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. మీషోతో ఒప్పందం ప్రకారం మీషో సేవలు ఇకపై తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించనున్నాయి. ఈ మేరకు త్వరలోనే మీషో సంస్థ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm