హైదరాబాద్: భారతీయ తపాలా శాఖ వారు కమీషన్ ఆధారంగా తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా పాలసీలు సేకరించడానికీ ఏజెంట్లను నియమించనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరన్నారు. ఆసక్తి కలిగినవారు జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ కు తపాలా కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఎంపికైన అభ్యర్థులు జూన్ 15వ తేదీన ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ కె. సంతోష్ నేత తెలిపారు. ఏజెంటుగా నియమితులైనవారు, సెక్యురిటి డిపాజిట్ గా రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్నివివరాలకు మీ సమీపంలో ఉన్నా తపాలా కార్యాలయము లేదా సికింద్రాబాద్ డివిషనల్ ఆఫీస్, గాంధీనగర్ ను సంప్రదించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 06:03PM