హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బెంగళూరుకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరు వెళ్లారు. మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానాలపై చర్చించనున్నట్టు తెలిసింది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ తిరిగి సాయంత్రం 4 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm