హైదరాబాద్ : గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అమీర్ పేట్ లో 50 పడకల ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆస్పత్రికే పోతా అని అంటున్నారు. గీతారెడ్డి డాక్టర్ అయ్యు ఉండి ఇలా మాట్లాడటం తగదు. జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఆస్పత్రి వెళ్లి అభినందించారు. సంగారెడ్డి మెడికల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మీ పక్కనే ఉన్నారు అడగండి.
కరోనా సమయంలో సీఎం.. గాంధీలో తిరిగి ధైర్యం నింపారు. ఉస్మానియ వెళ్లి 200 కోట్లు విడుదల చేశారు. కోర్టుకు వెళ్లారు కొందరు. ఢిల్లీ ఆసుపత్రి వెళ్తే విమర్శించారు. మంచి ఎక్కడ ఉన్నా తీసుకుంటాము. కాంగ్రెస్ హయాంలో జిల్లా మెడికల్ కాలేజీ పెట్టాలని సోయి ఉందా. 70 ఏండ్లల్లో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, 7 ఏండ్లలో 33 కాలేజీలు ఏర్పాటు చేశాము. కాలేజీలు పెడితే ఎందుకు పిల్లలు ఉక్రెయిన్, చైనా వెళ్లారు. కాంగ్రెస్ అంటే ఏసీ కార్లలో లో ఉంటారు. మేము బస్తీల్లో ఉంటాము. కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం. ఒక లీడర్ కు మరొక లీడర్ కు మాటలకు పొంతన ఉండదు. కాంగ్రెస్ మాటల పార్టీ, మాది చేతల పార్టీ. నాడు వానాకాలం లో ఏజెన్సీలు మంచం పట్టెవి ఇప్పుడు ఉన్నాయా.!?
కాంగ్రెస్ పాలన కంటే ఆసుపత్రులు బాగు చేశాం. 15 లక్షల కాన్పులు చేసాము. 1500 కోట్లు అదనంగా చేశాం. కోటి 50 లక్షల మందికి కండ్ల పరీక్ష చేశాం. ఆరోగ్య శ్రీ గురించి మాట్లాడారు.. మేము 2 నుండి 5 లక్షలకు పెంచాను. 3.60 లక్షల మంది సేవలు పొందారు. 850 కోట్లు ఖర్చు పెట్టారు. లిస్ట్ పంపిస్తా వెళ్లి అడగండి.
కేంద్ర ప్రభుత్వం, నీతీ ఆయోగ్ చెప్పినట్టు మనం దేశంలో మూడో స్థానంలో ఉన్నాము. ఏంఎంఅర్ గణనీయంగా తగ్గింది 56 కి తగ్గించాం. తమిళనాడును దాటాము.నాలుగు టిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరబాద్ లోనే 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయి` అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 02:14PM