హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త చెప్పింది. పరస్పర బదిలీల కింద ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు విద్యా శాఖలో ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీలకు కూడా త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Jun,2022 02:47PM