తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 74,288 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 36,473 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm