అమరావతి : బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్లో పోస్టును ఫార్వర్డ్ చేశాడని ఓ మెడికల్ షాపు యజమానిని(కెమిస్ట్) దుండగులు దారుణంగా హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గత నెల 21న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అసలు నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ తెలిపారు. అయితే అసలు నిందితుడు ఇంకా దొరకనందున హత్యకు గల అసలు కారణాలు తెలియలేదని పోలీసు కమిషనర్ చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. నుపుర్ శర్మకు మద్దతుగా ఉన్న ఓ పోస్టును ప్రహ్లాద్ రావు పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దాంతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ఇర్ఫాన్ ఖాన్ అనే వ్యక్తి ప్రహ్లాద్రావు హత్యకు కుట్ర పన్నాడని తెలిసింది. అందుకోసం ఐదుగురు వ్యక్తులను నియమించి, వారికి పదివేలు ఇస్తానని ఇర్ఫాన్ చెప్పాడని తెలిసింది. జూన్ 21 రాత్రి ప్రహ్లాద్ రావు తన ఔషధ దుకాణాన్ని మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో అతన్ని దుండగులు హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రహ్లాద్రావు భార్య, కుమారుడు మరో వాహనంపై ఆయన వెంటే వెళుతున్నారని తెలిపారు. ప్రహ్లాద్రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా రోజూవారీ కూలీలు అని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Jul,2022 03:58PM