హైదరాబాద్ : హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలపై కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. బిల్లో ఆటోమెటిక్గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) నిషేధించింది . నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్ అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం... హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లో సర్వీస్ ఛార్జ్ను ఆటోమెటిక్గా కలపొద్దు. అలాగే ఇతర పేర్లతో సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదు. సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని వినియోగదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి చేయరాదు. అది పూర్తిగా వారిష్టమని చెప్పాలి. నిబంధనలు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ విధించిందని కస్టమర్ భావిస్తే.. బిల్ నుంచి ఆ అదనపు మొత్తాన్ని తొలగించాలని అక్కడి యాజమాన్యాన్ని అడగొచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కస్టమర్లు 1915 నంబర్కు కాల్ చేసి లేదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్(ఎన్సీహెచ్) యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
సర్వీస్ ఛార్జ్ విషయమై కస్టమర్లు వినియోగదారుల కమిషన్కూ ఫిర్యాదు చేయవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Jul,2022 08:13PM