హైదరాబాద్ : ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మెన్కు ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని... రెండు కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని లేఖలో కోరారు.
అలాగే కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్ స్టోరేజ్ స్కీమ్ల ప్రతిపాదనపై మరో లేఖ రాశారు. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు. తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాల కోసం తరలింపు సరికాదని పేర్కొన్నారు. పంప్డ్ స్టోరేజ్ స్కీమ్, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదని చెప్పారు. అనుమతి లేని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్లను పరిశీలించాలన్నారు. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని వాటిని పరిశీలించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 05:19PM