పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు ఈ సాయంత్రం తరలించే అవకాశం ఉంది. గత వారం లాలూ ప్రసాద్ తన ఇంట్లోనే మెట్లు జారి పడ్డారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే పాట్నాలోని పారాస్ ఆస్పత్రికి తరలించారు. లాలూ భుజం, వెన్నెముకకు తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు నిర్ధారించారు. అలాగే పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం బుధవారం ఉదయం నాటికి మరింత క్షీణించిందని సమాచారం. ఇదిలా ఉండగా లాలూను ఆ రాష్ర్ట సీఎం నితీష్ కుమార్ బుధవారం పరామర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm