న్యూఢిల్లీ : డోలో- 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై ఐటి శాఖ దాడులు జరిపింది. ఢిల్లీ సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 200 మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని కంపెనీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. మైక్రో ల్యాబ్స్ సిఎండి దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసా ల్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల డోలో-650 టాబ్లెట్లను విక్రయించింది. పారాసెటమాల్ కు పర్యాయ పదంగా మారినట్లు నిపుణులు పేర్కోన్న సంగతి తెలిసిందే. ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.400 కోట్ల ఆదాయంతో అనేక కంపెనీలను వెనక్కి నెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 06:17PM