నల్గొండ : సింగరేణిలో రూ. 40 వేల కోట్ల అవినీతిని త్వరలోనే బయటపెడతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరూ కూడా దొంగలేనన్నారు. వారిద్దరూ అదానీకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను కేటీఆర్ అదానీబాద్ గా మార్చాలని చూస్తున్నారని తెలిపారు. అదానీ కంపెనీతో కేసీఆర్ బంధువు ప్రతిమ శ్రీనివాసరావు రూ. 60 వేల కోట్లతో కోల్ మైన్ ఎలా లీజ్ కు ఇచ్చారని ప్రశ్నించారు. ఇతర కాంట్రాక్టర్లు రూ. 20 వేల కోట్లకే ఈ లీజుకు సిద్దమైతే రూ. 60 వేల కోట్లకు తమ బంధువుకు సింగరేణి మైనింగ్ లీజును కట్టబెట్టార ఆరోపించారు. సింగరేణిలో చోటు చేసుకొన్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. ఈ విషయమై హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపారు. ఆ లీజ్ ను తాను క్యాన్సిల్ చేయించే వరకు పోరాటం చేస్తానన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm