హైదరాబాద్: బీఆర్ఎస్ విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో పథకాలు బాగున్నాయని.. దేశమంతా ఇలాంటి పథకాలు అమలుకావాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి తాము పోటీ చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ తో కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ తిరుగుతారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm