ఒడిశా: అన్నంలో చీమలు ఎలా పడ్డాయని భార్యను అడిగినందుకు భర్తను చంపేసిన ఘటన ఒడిశా రాష్ట్రం సుందర్గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం హేమంతా బాఘ్(35), సరిత(30) ఇద్దరు భార్యా, భర్తలు వీరికి ఇద్దరు కుమార్తెలు హేమలత, సౌమ్య ఉన్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తుండగా అన్నంలో చీమలు కనిపించడంతో భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదై క్షణికావేశంలో భర్త గొంతు నులిమి భార్య చంపేసింది. హేమంత్ తండ్రి శశిభూషణ్ భాఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సరితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm