చెన్నై: తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని సామినాథపురం ఏరియాలోని ఓ ప్రయివేటు స్పిన్నింగ్ మిల్లులో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్పిన్నింగ్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm