హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ నుంచి ఆయన బాధ్యతలను అందుకున్నారు. 2024 జూన్ వరకు జవహర్ రెడ్డి సీఎస్ గా కొనసాగే అవకాశం ఉంది. తనకు సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సీఎం జగన్ కు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. సీఎస్ గా బాధ్యతలను చేపట్టిన జవహర్ రెడ్డికి వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm