హైదరాబాద్: నగరంలో రెండు రోజులుగా చలితీవ్రత పెరిగింది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు తగ్గాయి. రాజేంద్రనగర్లో 14.6, సరూర్నగర్లో 14.9, సికింద్రాబాద్, గాజులరామారం, అల్వాల్లో 15.0 డిగ్రీలు నమోదయ్యాయి. శివారు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడం, తెల్లవారు జామున మంచు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm