హైదకాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా రాజ్ భవన్ లో ఘనంగా పౌర సన్మానం అందుకున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరారు. సీఎం జగన్, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, రాష్ట్రపతి వెంట గవర్నర్, కిషన్ రెడ్డి కూడా విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్రపతికి విశాఖలో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వాగతం పలకనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము సాయంత్రం 4.20 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 4.30 నుంచి నావికాదళ దినోత్సవ విన్యాసాలు తిలకించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm