74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.#RepublicDay pic.twitter.com/edYx6EPMSu
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2023
నవతెలంగాణ - హైదరాబాద్
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ తరుణంలో వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, తదితరులు పాల్గొన్నారు.