నవతెలంగాణ - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు శంభాజీ రాజే భేటీ గురువారం భేటీ
అయ్యారు. ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్కు వచ్చని శంభాజీ రాజేకు సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. సీఎం కేసీఆర్, ఛత్రపతి శంభాజీ రాజే మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శంభాజీ రాజే ప్రశంసించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించిన ఆయన.. తెలంగాణ ప్రగతి నమూనా దేశవ్యాప్తంగా విస్తరించాలని అభిప్రాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm