నవతెలంగాణ - అమరావతి
సినీనటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానిక టీడీపీ నేతలు ఆయన్ను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm