హైదరాబాద్ : భవనం అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ లోని మారెడ్ పల్లిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..భవనంలోని ఏడో అంతస్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm