నవతెలంగాణ - హైదరాబాద్
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం ఉదయం మృతిచెందారు. ఈ తరుణంలో స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm