నవతెలంగాణ - న్యూఢీల్లి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో రూ.45.03 లక్షల కోట్ల వ్యయంతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. అమృత కాలంలో వస్తున్న తొలి బడ్జెట్ ఇది. పురోగామి భారత్ కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో కూడిన ఆశావాహ సమాజం కలలను సాకారం చేసే బడ్జెట్ అని అభవర్ణించారు. అభివృద్థి పథంలో పయనిస్తున్న భారత్ కు ఈ బడ్జెట్ కొత్త శక్తిని అందిస్తుందని మోడీ వ్యక్తం చేశాడు. సంప్రదాయరీతిలో తమ చేతులతో శ్రమిస్తూ దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న 'విశ్వకర్మ'లు నవభారత సృష్టికర్తలు. అలాంటి 'విశ్వకర్మ'ల కోసం తొలిసారిగా శిక్షణ, పద్దతులతో కూడిన ఓ పథకాన్ని నేటి బడ్జెట్ లో ప్రకటించామని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Feb,2023 03:46PM