నవతెలంగాణ - ముంబయి
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఆరంభంలో ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్పంగా తగ్గి 59,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 17,578 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.81 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటన్, భారతీ ఎయిర్టెల్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Feb,2023 10:18AM